
కేంద్ర పథకాలతోనే రాష్ట్రంలో అభివృద్ధి
కొత్తపల్లి: రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని, కేంద్ర పథకాలు, నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం కొత్తపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామ శివారులో తిరుమలనాథస్వామి గుట్ట ఆలయ ప్రాంగణంలో నిర్మించే భవనానికి ఎంపీ భూమి పూజ నిర్వహించారు. అలాగే, అల్లీపూర్లో హైమాస్ట్ లైట్లను ప్రారంబించారు. నాగురావు నామాజీ, రతంగ్ పాండురెడ్డి, అనంత్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, పడాకుల శ్రీను, డోకూర్ పవన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.