స్థానికంగానే పరిశ్రమ ఏర్పాటుచేయాలి.. | - | Sakshi
Sakshi News home page

స్థానికంగానే పరిశ్రమ ఏర్పాటుచేయాలి..

Apr 30 2025 12:09 AM | Updated on Apr 30 2025 12:09 AM

స్థానికంగానే పరిశ్రమ ఏర్పాటుచేయాలి..

స్థానికంగానే పరిశ్రమ ఏర్పాటుచేయాలి..

ప్రభుత్వం అందించిన రాయితీ ప్రోత్సాహం, అధికారుల సహకారంతో 7 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుచేశాను. ఇటీవల గెలలను కోసి అశ్వారావుపేటకు తరలించాను. స్థానికంగానే పరిశ్రమ ఉంటే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్‌, రైతు, గూడెబల్లూరు, మాగనూర్‌ మండలం

రైతులను ప్రోత్సహిస్తున్నాం..

జిల్లాలో ప్రస్తుతం 6వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగవుతోంది. మరో 4వేల ఎకరాల్లో సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. 10వేల ఎకరాలు పూర్తిచేస్తే మన జిల్లాలోనే పరిశ్రమ ప్రారంభమవుతుంది. ఇటీవల ధర భాగా పెరిగిన పరిస్థితుల్లో రైతులు ఆయిల్‌పాం సాగుపై దృష్టిసారించాలి. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి.

– చంద్రశేఖర్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి, నారాయణపేట

త్వరలో ఇబ్బందులు తీరుతాయి..

యిల్‌ఫెడ్‌ జీఎం అందించిన సమాచారం మేరకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్ద 95 ఎకరాల్లో, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో 40 ఎకరాల్లో ఆయిల్‌పాం పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. నారాయణపేట జిల్లాలోని మరికల్‌ మండలం చిత్తనూర్‌ వద్ద 80 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటుకు స్థలం సేకరణలో దాదాపు కొలిక్కి వచ్చింది. మరో కొన్ని నెలల్లో రైతులు స్థానికంగానే పంటను విక్రయించవచ్చు.

– సమీనా బేగం, జిల్లా ఆయిల్‌ఫెడ్‌ ఇన్‌చార్జి, నారాయణపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement