
ట్రైనీ కలెక్టర్గా ప్రణయ్కుమార్
నారాయణపేట: జిల్లా ట్రైనీ కలెక్టర్గా 2024 తెలంగాణ ఐఏఎస్ బ్యాచ్కు చెందిన కొయ్యాడ ప్రణయ్ కుమార్ను ప్రభుత్వం కేటాయించింది. ఈమేరకు ఆయన సోమవారం కలెక్టర్ సిక్తాపట్నాయక్ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు చేపట్టారు. జిల్లాపై అవగాహన కలిగి అభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ సూచించారు.
‘ప్రజావాణి’కి34 ఫిర్యాదులు
నారాయణపేట: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 34 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ బెంషాలం వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
‘ఎల్ఆర్ఎస్’ రాయితీని
సద్వినియోగం చేసుకోవాలి
నారాయణపేట: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రకటించిన 25శాతం ఫీజు రాయితీని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రాయితీ గడువు ఈ నెల ఈనెల 30 వరకు ఉంటుందని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీ గడువుకు మళ్లీ పొడగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
బాల్య వివాహాలను అరికట్టాలి
నారాయణపేట: జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 30న బసవ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే బసవ జయంతి రోజున ఎక్కువగా వివాహాలు జరుగుతాయని, ఇదే సమయంలో బాల్యవివాహాలు జరిగే అవకాశం ఉందని, బాల్య వివాహాలు జరగకుండా అధికారులు నిఘా ఉంచి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎవరైన బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ నెల 30 న ఎక్కడైనా బాల్య వివాహం చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే హెల్ప్ లైన్ 1098 కి కాల్ చేయాలని ప్రజలను కోరారు.
పెసర క్వింటాల్ రూ.7,651
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పెసర క్వింటాల్కు గరిష్టంగా రూ.7,651, కనిష్టంగా రూ.6,225 ధర పలికింది. అలాగే, జొన్నలు గరిష్టంగా రూ.3,555, కనిష్టంగా రూ.3,425, వడ్లు హంస క్వింటాల్కు గరిష్టంగా రూ.1,771, కనిష్టంగా రూ.1,610, వడ్లు సోనా గరిష్టంగా రూ.2,186, కనిష్టంగా రూ.1,455, ఎర్ర కందులు గరిష్టంగా రూ.6,919, కనిష్టంగా రూ.6,829, తెల్ల కందులు గరిష్ట, కనిష్టంగా రూ.7,019 ధర పలికాయి.
మొక్కజొన్న క్వింటాల్ రూ.2,261
జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డులో సోమవారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,261, కనిష్టంగా రూ.1,469 ధరలు లభించాయి. అలాగే వేరుశనగ గరిష్టంగా రూ.5,789, కనిష్టంగా రూ.4,121, ఆముదాలు గరిష్టంగా రూ.6,110, కనిష్టంగా రూ.4,600, జొన్నలు గరిష్టంగా రూ.4,107, కనిష్టంగా రూ.2,001, ధాన్యం హంస గరిష్టంగా రూ.2,015, కనిష్టంగా రూ.1,809, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,369, కనిష్టంగా రూ.1,803 పలికాయి.
ఆర్ఎన్ఆర్ రూ.2,201
దేవరకద్ర మార్కెట్ యార్డులో జరిగిన ఈ టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,201, కనిష్టంగా రూ.1,862 ధరలు లభించాయి.

ట్రైనీ కలెక్టర్గా ప్రణయ్కుమార్