
రాక్షస పాలన రాజ్యమేలుతోంది
కొలిమిగుండ్ల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. ఇటీవల చింతలాయిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నేత నీలం సంజీవకుమార్రెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేసిన విషయం విదితమే. ఈ మేరకు జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే గురువారం గ్రామానికి చేరుకుని సంజీవకుమార్రెడ్డిని పరామర్శించారు. దాడి ఘటనతో పాటు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నా రు. దాడికి పాల్పడిన వారిపై కాకుండా బాధితులపైనే పోలీసులతో కేసులు నమోదు చేయిస్తున్నారని కాటసాని మండిపడ్డారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని, ఆ సమయంలో ఇలాంటి అరాచకాలు చూడలేదన్నారు. పూర్వ పరాలు పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేసేవారన్నారు. రాష్ట్రంలో దాడులు, అక్రమ కేసులు తప్ప మరొకటి లేదన్నారు. అభివృద్ది, సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారని విమ ర్శించారు. వారి వెంట వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షు డు లాయర్ మహేశ్వరరెడ్డి, నాయకులు కాటసాని తిరుపాల్ రెడ్డి, అంబటి చంద్రమోహన్రెడ్డి, కొప్పుల నారాయణరెడ్డి, జయ రామ కృష్ణుడు, ఇటిక్యాల నారాయణరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, ఓబులేసు, రామేశ్వరరెడ్డి, రామనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.