
మిరప వేసి రూ. 18 లక్షలు నష్టపోయా..
12 ఎకరాల్లో తేజ రకం మిర్చి పంట సాగు చేశాను. రూ.28 లక్షల దాకా ఖర్చు అయ్యింది. అయితే వాతావరణంలో మార్పుల కారణంగా 10 క్వింటాళ్లు కూడా రాలేదు. అందులో సగానికి సైగా తాలు వచ్చింది. గత ఏడాది క్వింటా రూ.22వేల నుంచి రూ.25వేల వరకు పలికింది. ఈ ఏడాది రూ.10వేలు పలుకుతుంది. ఇక తాలు రకం గత ఏడాది క్వింటాకు రూ.16 వేలు ధర ఉంటే ఈ ఏడాది రూ.4,500 దక్కలేదు. ఈ ఏడాది మొత్తం మీద ఎకరాకు సుమారు రూ.1.50 లక్షల చొప్పున మొత్తం రూ.18 లక్షలు నష్టం వచ్చింది. –గోపాల్రెడ్డి, మిట్నాల, నంద్యాల మండలం