రఘువీర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి | Sakshi
Sakshi News home page

రఘువీర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

Published Tue, Apr 16 2024 1:55 AM

మాట్లాడుతున్న బల్మూరి వెంకట్‌  - Sakshi

సూర్యాపేట: కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని సీతారామ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌ఎస్‌యూఐ ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించిందని, లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటే అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు తప్ప దేశాన్ని అభివృద్ధి చేయడం లేదన్నారు. బీజేపీ దేవుడి పేరు వాడుకొని అధికారంలోకి రావడం తప్ప పేద ప్రజల అవసరాలు తీర్చడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఇన్‌చార్జి మహ్మద్‌ ఫహాద్‌, ఓబీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు,

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌

Advertisement
Advertisement