19న సీపీఎం అభ్యర్థి నామినేషన్‌ | Sakshi
Sakshi News home page

19న సీపీఎం అభ్యర్థి నామినేషన్‌

Published Mon, Apr 15 2024 1:50 AM

మాట్లాడుతున్న చెరుపల్లి సీతారాములు 
 - Sakshi

చౌటుప్పల్‌ : సీపీఎం భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ ఈనెల 19న నామినేషన్‌ దాఖలు చేయనున్నారని, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలేని కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు కోరారు. చౌటుప్పల్‌ పట్టణంలోని రంగారెడ్డి స్మారక భవనంలో ఆదివారం జరిగిన సీపీఎం మండల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బడుగు, బలహీనవర్గాల కోసం నిరంతర పోరాటాలు నిర్వహించే కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండాలన్నారు. కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉన్న సమయంలో పేదలకు ఉపయోగపడే ఎన్నో చట్టాలను తయారు చేశారని గుర్తుచేశారు. డబ్బు సంచులతో వచ్చే పార్టీలను తరిమికొట్టాలన్నారు. సమావేశంలో నాయకులు పైళ్ల ఆశయ్య, దోనూరి నర్సిరెడ్డి, బూర్గు కృష్ణారెడ్డి, గంగదేవి సైదులు, కిష్టయ్య, సంజీవరెడ్డి, మోహన్‌, మధుకృష్ణ, వెంకటేశంం, బాలయ్య, శ్రీశైలం, అంజయ్య, జనార్దన్‌, శ్రీనివాస్‌రెడ్డి, పాల్గొన్నారు.

Advertisement
Advertisement