కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం | Sakshi
Sakshi News home page

కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం

Published Sat, Apr 13 2024 1:15 AM

- - Sakshi

బిజినేపల్లి: తిమ్మాజీపేట మండలం ఆవంచలో శుక్రవారం మహాలక్ష్మీ గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ పాణిగ్రహణం, జిలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దంపతులతో పాటు బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ పాల్గొని తిలకించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారిని శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

ప్రత్యేక అలంకరణలో మహాలక్ష్మీ గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి
1/1

ప్రత్యేక అలంకరణలో మహాలక్ష్మీ గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి

Advertisement
Advertisement