
విస్త్తృత తనిఖీలు చేపడతాం..
విద్యాసంస్థల ప్రారంభంలోగా.. బస్సులన్నింటికీ సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలి. లేకుంటే విస్తృత తనిఖీలు చేపట్టడం ద్వారా పట్టుబడిన వాహనాలు సీజ్ చేస్తాం. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానా విధిస్తాం. పరీక్షలకు రాని బస్సులకు సంబంధించి యజమానులకు నోటీసులు పంపిస్తాం. అనుభవం ఉన్న డ్రైవర్ల నియామకం చేయాలి. పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – పురుషోత్తం, ఇన్చార్జ్ డీటీసీ, హనుమకొండ