మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

May 28 2025 5:41 PM | Updated on May 28 2025 5:41 PM

మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

ములుగు: ములుగును మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుకోవాలని అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) చీమలపాటి మహేందర్‌జీ అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరె న్స్‌ హాల్‌ మంగళవారం నిర్వహించిన నార్కో కోఆర్డినేషన్‌ సెంటర్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్‌, ఎకై ్సజ్‌ అధికారులు సమన్వయంతో ఉంటూ డ్రగ్స్‌ మూలాలను పెకిలించి వే యాలన్నారు. కళాశాలలు, వసతిగృహాలను తరుచుగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించా లని అన్నారు. విద్యార్థులు పెడదోవ పట్టకుండా అవగాహాన కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. విద్యార్థులు డ్రగ్స్‌ బారిన పడకుండా చూ డాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. డ్రగ్స్‌ నిర్ధారణ కిట్లను అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు. ఈ సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్‌కుమార్‌, నా ర్కోటిక్‌ ఎస్సై సురేష్‌, డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్‌ జగదీశ్వర్‌, బీసీ సంక్షేమ అధికారి లక్ష్మణ్‌నాయక్‌, ఎస్సీ డెవలప్‌ మెంట్‌ అధికారి రవి తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ మహేందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement