‘ఆపరేషన్‌ కగార్‌’ను నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

‘ఆపరేషన్‌ కగార్‌’ను నిలిపివేయాలి

May 2 2025 12:44 AM | Updated on May 2 2025 12:44 AM

‘ఆపరేషన్‌ కగార్‌’ను నిలిపివేయాలి

‘ఆపరేషన్‌ కగార్‌’ను నిలిపివేయాలి

వెంకటాపురం(కె)/వాజేడు: కేంద్ర, రారష్ట్‌ర ప్రభుత్వాలు చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ను నిలుపుదల చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు తాటి నాగరాజు అన్నారు. మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేత పేరుతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో హెలికాప్టర్లతో బాంబుల వర్షం కురిపిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఆపరేషన్‌ కర్రిగుట్టను నిలుపుదల చేసి ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని కోరారు. అదే విధంగా వాజేడు మండల పరిధిలోని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో గురువారం బోదెబోయిన సురేశ్‌ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఉయిక శంకర్‌ మాట్లాడుతూ కర్రిగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్‌ కగార్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. గుట్టల్లోని ఖనిజ సంపదను దోచుకోవడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేత పేరుతో కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో కట్టం నర్సింహరావు, చిక్కుడు రజనీకుమార్‌, ఉయిక జగన్‌, మడప పగిడయ్య, పీర్ల మల్లిఖార్జునరావు, శ్యామల వెంకటేశ్వర్లు, బొగ్గుల సమ్మయ్య, కణితి శేషు, సోడి సారయ్య, శ్యామల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement