
నలుగురిపై వైల్డ్లైఫ్ యాక్ట్ కేసులు
ఏటూరునాగారం: అడవిలో నిబంధనలకు విరుద్ధంగా నిప్పు, వంట, ఆల్కాహాల్ సేవించడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించినందుకు నలుగురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం(వైల్డ్లైఫ్ యాక్ట్)1972 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి డిప్యూటీ రేంజ్ అఫీసర్లు పి.ప్రహ్లాద్, పి.నరేందర్లు తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చిన్నబోయినపల్లి సమీపంలోని అడవికి వెళ్లగా దుమ్మని శ్రీకాంత్, అడ్డూరి సుమంత్రెడ్డి, వినీత్రెడ్డి, ఖలీల్పాషాలు మద్యం సేవించడంతో పాటు వంట వండి అగ్గిపెట్టలను ఉపయోగించి అలాగే వదిలేయడంతో పాటు వంట వండి మంటలు ఆర్పక పోవడంతో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం రేంజ్ కార్యలయం సిబ్బంది పాల్గొన్నారు.