వెంకటాపురం(ఎం): ప్రజలు భయాందోళనకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ములుగు డీఎస్పీ రవీందర్ పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని గురువారం మండలంలోని సమస్యాత్మక ప్రాంతాలైన వెంకటాపురం, లక్ష్మీదేవిపేట గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ (పోలీసు కవాతు) నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. ప్రజలు ప్రలోభాలకు గురికాకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆడిషనల్ ఎస్పీ సదానందం, ములుగు సీఐ రంజిత్కుమార్, ఎస్సైలు చల్లా రాజు, సతీష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
బార్డర్ చెక్పోస్టు వద్ద మద్యం పట్టివేత
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం మద్యం దుకాణం నుంచి మహారాష్ట్రకు తరలిపోతున్న మద్యం బాటిళ్లను ఎస్ఎస్టీ తనిఖీ బృందం పట్టుకుంది. బుధవారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తుండగా లిక్కర్ 10.5లీటర్లు, బీర్లు 7.8లీటర్లు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకొని తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని, మద్యం విలువ సుమారు రూ.5వేల వరకు ఉంటుందని కాటారం ఎకై ్సజ్ సీఐ నరేందర్ తెలిపారు.