ఏటూరునాగారం: కులాల పేరు చెప్పి ఓట్లు అడిగే వారిని నిలదీయాలని ములుగు నియోజకవర్గ ముదిరాజ్ మహాసభ ఇన్చార్జ్ చిటమట రఘు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ముదిరాజ్ మహాసభ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒక్క ముదిరాజ్ అభ్యర్థిగా ఎమ్మెల్యే బీఫామ్ ఇవ్వలేదన్నారు. సర్పంచ్, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు గుర్తుకు రాని ముదిరాజ్లు ఇప్పుడు గుర్తుకు వస్తున్నారా అని ప్రశ్నించారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్, పల్లెబోయిన అశోక్ నాయకత్వం ఆధ్వర్యంలో ములుగు జిల్లా ముదిరాజ్ మహాసభ కుటుంబ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడిగా బొల్లు దేవేందర్ను రెండు సంవత్సరాల క్రితం నియమించారన్నారు. అయితే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల వద్ద ముదిరాజ్ల ఆత్మగౌరవాన్ని కోళ్ల వెంకన్న తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఆయన ముదిరాజ్ల సమస్యలపై ప్రభుత్వాన్ని కోరిన దాఖలాలు లేవన్నారు. వెంకన్న మాటలు ముదిరాజ్లు నమ్మొద్దని కోరారు.
ముదిరాజ్ల ఓట్లు అడిగితే నిలదీయాలి
Published Sat, Nov 11 2023 1:36 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement