
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని గూడూర్లో నిర్మించిన శ్రీ గురుపీఠంలో దేవతామూర్తులు విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. రెండో రోజు వాస్తుపూజ, హోమం, లక్ష గోధారణ, క్షీరాధివాసం, మంత్ర పుష్పం తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. నేడు, రేపు కూడా పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యేలు హరీశ్రావు, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర నాయకులు ప్రతాప్రెడ్డి, దేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణగౌడ్, నాయకులు తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.