
ఘనంగా ఆవిర్భావ వేడుకలు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ మహేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో మరింత బాధ్యతగా పనిచేసి, రాష్ట్ర, జాతీయస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మెదక్ మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ప్రత్యేక అధికారి నగేష్ జెండావిష్కరణ చేశారు. ఈసందర్భంగా పారిశుద్ధ్యంపై వంద రోజుల యాక్షన్ ప్లాన్పై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ శ్రీనివాస్రెడ్డితో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లా బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా ఆవిర్భావ వేడుకలు