
యాజమాన్య పద్ధతులు తప్పనిసరి
కొల్చారం(నర్సాపూర్): పంటల సాగులో యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అన్నారు. ఆదివారం మండలంలోని పోతిరెడ్డిపల్లి, రంగంపేటలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కా ర్యక్రమంలో భాగంగా రైతులకు శిక్షణ కార్య క్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మట్టి నమూనా సేకరణ విధానం, భూసార పరీక్షల వలన కలిగే లాభాలను రైతులకు వివరించారు. అధిక దిగుబడినిచ్చే కేఎన్ఎం 1,638, ఆర్ఎన్ఆర్ 15048, 28361, జేజీఎల్ 24423, కేఎన్ఎం 118, 28361 సాగు చేయాలన్నారు. రసాయన ఎరువులతో పాటు, పచ్చిరొట్టతో అధిక దిగుబడి పొందవచ్చన్నారు. రైతులు విత్తనాలు కొనే ముందు తీసు కోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు గురించి వివరించా రు. శాస్త్రవేత్తలు ప్రతాప్రెడ్డి, ప్రనూష, బసవరాజు, ఏఓ శ్వేత, రైతులు పాల్గొన్నారు.