
మల్లన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. స్వామివారిని దర్శించుకున్న అనంతరం గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ ఎస్పీ అన్నపూర్ణ.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాటేజీల నిర్మాణానికి మంచిర్యాలకు చెందిన దాతలు మహేందర్, రవీందర్లు రూ.15లక్షలు చెక్కురూపంలో ఈఓ అన్నపూర్ణకు అందించారు. – కొమురవెల్లి(సిద్దిపేట)

మల్లన్న క్షేత్రం.. భక్తజన సంద్రం