
అనాథలకు ఆర్థిక సహాయం
పాపన్నపేట(మెదక్): ‘బడికి సెలవులంటేనే భయం’ శీర్షికన గతంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి టీచర్లు స్పందించారు. శనివారం కుర్తివాడలోని పిల్లలు లావణ్య, అనురాధ, నవీన్ వద్దకు వెళ్లి రూ. 26 వేల ఆర్థిక సహాయం అందజేశారు. పీఆర్టీయూ పాపన్నపేట శాఖ పిలుపు మేరకు మండల ఉపాధ్యాయులంతా తలా కొంత పోగు చేసి ఆర్థిక సహాయం చేశారు. పిల్లల కనీస అవసరాల కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల పీఆర్టీయూ అధ్యక్షుడు రాజు, కార్యదర్శి సురేష్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అంజనాచారి, ఉపాధ్యక్షుడు రవీందర్రెడ్డి, కార్యదర్శి జనార్దన్, జిల్లా కార్యదర్శి స్వామి, మండల అసోసియేట్ అధ్యక్షుడు సంతోష్ కుమార్, మండల కార్యదర్శి నాగేశ్వర్, సాయిలు, మధుసూదన్, సీఆర్పీ దేవయ్య పాల్గొన్నారు.

అనాథలకు ఆర్థిక సహాయం