ధాన్యం తీసుకోని మిల్లర్లపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తీసుకోని మిల్లర్లపై చర్యలు

May 1 2025 7:29 AM | Updated on May 1 2025 7:29 AM

ధాన్యం తీసుకోని మిల్లర్లపై చర్యలు

ధాన్యం తీసుకోని మిల్లర్లపై చర్యలు

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు

నర్సాపూర్‌ రూరల్‌: ధాన్యం తీసుకోని రైస్‌ మిల్లర్లపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. బుధవారం మండలంలోని తుజాల్‌పూర్‌, బ్రాహ్మణపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ధాన్యం తూకం, ట్యాబ్‌ ఎంట్రీ, రికార్డులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి తరలించిన ధాన్యాన్ని ఎక్కడైనా రైస్‌ మిల్లర్లు తీసుకోకుంటే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద 30 వరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఒకవేళ అందుబాటులో లేకుంటే ఏఎంసీల నుంచి తెచ్చుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సి బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. ఆయన వెంట సీసీ రవీందర్‌, కమిటీ సభ్యులు లావణ్య, సుమలత, సీఐ నవనీత ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement