
రైతులకు తరుగు కష్టాలు
●
నిబంధనల ప్రకారం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం బిలోపవర్టీలైన్(బీపీఎల్) కింద 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే నిర్మించాలి. ఏ మాత్రం ఎక్కువ నిర్మించినా బిల్లులు ఇవ్వడం కుదరదు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి అధికారుల ద్వారా లబ్ధిదారులకు అవగాహన కల్పించాం. నిబంధనల ప్రకారం నిర్మించిన 54 మందికి ఇప్పటికే బిల్లులు చెల్లించాం.
– మాణిక్యం, హౌసింగ్ పీడీ, మెదక్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: తరుగు పేరుతో అన్నదాతల నిలువు దోపిడీ షురువైంది. తరుగు పేరుతో క్వింటాల్కు నాలుగు నుంచి ఐదు కిలోల వరకు తూకంలో కోత పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్మిల్లర్లు కుమ్మకై ్క రైతులపై దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైన పక్షం రోజుల్లోనే ఈ తరుగుపేరుతో సాగిన దోపిడీ ఏకంగా రూ.2.36 కోట్లు ఉందంటే.. ఈ సీజను ముగిసేసరికి దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ దోపిడీ లెక్క
మెదక్ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ఊపందుకుని రెండు వారాలు గడుస్తోంది. ఈ నెల 28 వరకు జిల్లా వ్యాప్తంగా 5,873 మంది రైతుల వద్ద 25,472 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అయితే ఈ తరుగు పేరుతో 40 కిలోల బస్తాకు..గన్నీ సంచి బరువు పోగా రెండు నుంచి మూడు కిలోల ధాన్యం అధికంగా తూకం వేస్తున్నారు. ఈ లెక్కన క్వింటాల్కు కనీసం ఐదు కిలోలు రైతుల ధాన్యం తూకంలో కోత పెడుతున్నారు. తక్కువలో తక్కువ క్వింటాల్కు నాలుగు కిలోల చొప్పున లెక్కించినా టన్నుకు 40 కిలోల వరకు రైతులు నష్టపోతున్నారు. ఈ లెక్కన ఈ రెండు వారాల్లో కొనుగోలు చేసిన 25,472 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఏకంగా 1,081 టన్నుల ధాన్యం దోపిడీ జరిగినట్లు తేలింది. ప్రస్తుతం ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.2,320 ఉంది. అంటే ఈ పక్షం రోజుల్లో రైతుల వద్ద దోపిడీ చేసిన ఈ 1,081 టన్నుల ధాన్యం విలువ ఏకంగా రూ.2.36 కోట్లు ఉంటుందని అంచనా.
తరుగు ఇవ్వనంటే చుక్కలే..
ఒకవేళ ఎవరైనా రైతులు తరుగుపై ప్రశ్నిస్తే ఆ రైతుకు కేంద్రాల నిర్వాహకులు చుక్కలు చూపిస్తున్నారు. నీ ధాన్యంలో తాలు అధికంగా ఉందని, తేమ శాతం ఎక్కువ ఉందని, ఇలా అనేక కొర్రీలు పెడుతున్నారు. ఒకవేళ తాలు ఉంటే హార్వెస్టర్ బ్లోయరే నిర్ణీత ఆర్పీఎం స్పీడుతో ఆ తాలును తీసేస్తుంది. పైగా ప్రస్తుతం ఎండలు 44 డిగ్రీలు దాటుతోంది. ఈ క్రమంలో ధాన్యంలో తేమ ఉండటం అసాధ్యం. తేమ 17 శాతం వరకు అనుమతి ఉంటుంది. తూకంలో కోత పేరుతో దోపిడీ యథేచ్ఛగా సాగుతుండటం గమనార్హం.
పీఏసీఎస్ కేంద్రాల్లో మరీ దారుణం..
జిల్లాలో ప్రస్తుతం మొత్తం 480 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ కొనసాగుతోంది. ఇందులో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు 92 కాగా, మిగిలిన 388 కేంద్రాలు పీఏసీఎస్లు. అయితే ఐకేపీ కేంద్రాలతో పోల్చితే.. ఈ పీఏసీఎస్లు నిర్వహిస్తున్న కేంద్రాల్లో రైతులపై నిలువు దోపిడీ మరింత ఎక్కువగా ఉంటోంది. ఆయా పీఏసీఎస్ పాలకవర్గాలు రాజకీయ నేతలే రెస్మిల్లర్లతో కుమ్మకై ్క రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఒక్కో పాలకవర్గం నేత ఒక్కో సీజనుకు రూ.లక్షల్లో దండుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. దీంతో రానున్న రోజుల్లోనైనా ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను పీఏసీఎస్లకు తగ్గించి ఐకేపీలకు పెంచితే రైతులకు మేలు జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
పక్షం రోజుల్లోనే తరుగు దోపిడీ మొత్తం రూ.2.36 కోట్లు
క్వింటాల్కు 4 నుంచి 5 కిలోలు కోత
సర్కారు కొనుగోలు కేంద్రాల్లోనూ తాలు దందా
సర్కారు కేంద్రాల్లోనూ దందా..
ప్రైవేటు వ్యాపారులు చేసే కొనుగోళ్లలో తూకాల్లో కోతలు పెడుతుంటారు. కానీ సర్కారు కొనుగోలు కేంద్రాల్లోనూ ఇదే అక్రమ దందా సాగుతుంటే రైతులు తమ పంటను ఎక్కడ విక్రయించుకోవాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.