
నాణ్యమైన భోజనం అందించండి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం కౌడిపల్లిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్ను కలెక్టర్ సందర్శించారు. ఫుడ్ పాయిజన్తో 30మంది విద్యార్థినులు అస్వస్తతకు గురై చికిత్స పొందుతున్న విషయం విదితమే. దీంతో కలెక్టర్ సందర్శించి హాస్టల్లో గదులు, కిచెన్, బాత్రూంలతోపాటు సరిసరాలను పరిశీలించారు. విద్యార్థినులతో ప్రత్యేకంగా మాట్లా డి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా నాకు ఫోన్ చేయండి, తక్షణమే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ భరోసా కల్పించి తన ఫోన్ నంబర్ను ఇచ్చారు. అస్వస్థతకుగురైన వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యసేవలపై వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టల్లో పరిశుభ్రతను పాటిస్తూ రోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చేస్తే చర్యలు తప్పవని అధికారులను, సిబ్బందిని హెచ్చరించారు. విద్యార్థులకు అస్వస్థతకు గురికావడంపై విచారణ జరుగుతోందన్నారు. అస్వస్థతకు గురైన వారందరూ ప్రస్తుతం బాగున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓ పద్మజ, వార్డన్ నర్సమ్మ, డాక్టర్ ఫెర్నాజ్, సీహెచ్ఓ ఎలిజబెత్రాణి వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కలెక్టర్ రాహుల్రాజ్
ఇంటిగ్రేటెడ్ బాలిక హాస్టల్ సందర్శన
విద్యార్థినులతో మాట్లాడి
సమస్యలపై ఆరా

నాణ్యమైన భోజనం అందించండి