పాన్‌షాపుల్లో ఆకస్మిక తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పాన్‌షాపుల్లో ఆకస్మిక తనిఖీలు

Published Tue, Apr 29 2025 12:12 AM | Last Updated on Tue, Apr 29 2025 12:12 AM

పాన్‌షాపుల్లో ఆకస్మిక తనిఖీలు

పాన్‌షాపుల్లో ఆకస్మిక తనిఖీలు

నిర్మల్‌టౌన్‌: ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్‌పేట్‌, శాంతినగర్‌, చైన్‌గేట్‌ సమీపంలోని పలు పాన్‌షాపుల్లో నిర్మల్‌ ఏఎస్పీ రాజేష్‌ మీనా ఆధ్వర్యంలో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓసీబీ పేపర్స్‌ లభ్యం కాగా, సాధారణంగా వీటిలో గంజాయితో చుట్టి కాల్చడానికి ఈ పేపర్లు వాడతారని ఏఎస్పీ తెలిపారు. దీనిపై విచారణ చేయిస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్‌ సేవించిన, రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ సీఐ ప్రవీణ్‌ కుమార్‌, ఆర్‌ఎస్సై రవి, ప్రొబేషనరీ ఎస్సై జుబీర్‌, సుప్రియ, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement