
దోస్త్ రిజిస్ట్రేషన్ షురూ
మహబూబాబాద్ అర్బన్: డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ కోసం దోస్త్ 2025 ఫేజ్ 1 అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ ప్రారంభమైనట్లు నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.లక్ష్మణ్ నాయక్ తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ రిజిస్ట్రేషన్ కరపత్రాలను అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఫేజ్ 1 అడ్మిషన్ ప్రక్రియ మే 3 నుంచి 21 వరకు కొనసాగుతుందని, విద్యార్థులు రూ.200 చెల్లించి దోస్త్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చని, మొదటి విడత సీట్ అలాట్మెంట్ మే 29న జరుగుతుందని, సీట్ పొందిన విద్యార్థులు మే 30 నుంచి జూన్ 6 వరకు దోస్త్ పోర్టల్లో సీట్ నిర్ధారించుకోవాలన్నారు. ఫేస్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 30న మొదలవుతుందన్నారు. సలహాలు సూచనలకు దోస్త్ కోఆర్డినేటర్ వి. సాంబశివరావు (9440343941), రామన్న (9908883319) సంప్రదించవచ్చన్నారు.