‘హద్దులు’ దాటుతున్న దందా.. | - | Sakshi
Sakshi News home page

‘హద్దులు’ దాటుతున్న దందా..

Jun 6 2025 7:34 AM | Updated on Jun 6 2025 7:34 AM

‘హద్దులు’ దాటుతున్న దందా..

‘హద్దులు’ దాటుతున్న దందా..

ఎన్టీఆర్‌ జిల్లాలో అధికారికంగా ఎనిమిది రీచ్‌లకు అనుమతులున్నారు. అయితే పార్లమెంటు ప్రజా ప్రతినిధి చక్రం తిప్పి కేవలం చందర్లపాడు మండలం కాసరబాద, కంచికచర్ల మండలం వేములపల్లి రీచ్‌ల్లో మాత్రమే ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. దీంతో పాటు జగ్గయ్యపేట నియోజకవర్గంలో వత్సవాయి మండలంలో ఆలూరుపాడులో ఇసుక రీచ్‌ సైతం ఈయన కనుసన్నల్లోనే నడుస్తోంది. ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి పార్లమెంటు ప్రజా ప్రతినిధి, ఈ ఇసుక రీచ్‌లను తన కనుసన్నల్లో ఉంచుకొని, లారీకి రూ.10వేల చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. భారీగా తెలంగాణ రాష్ట్రానికి ఇసుక అక్రమంగా తరలించి దోపిడీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు సైతం తమకేమి పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ‘చినబాబు’ అండదండలు ఉండటంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. పేరుకే ప్రభుత్వం ఉచిత ఇసుక అని ఊదరగొడుతున్నా, సామాన్యునికి అందుబాటులో లేదని, ట్రాక్టర్‌కు ఇసుక లోడ్‌ చేయాలన్నా, డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement