ట్రాఫిక్‌ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ

Jun 3 2025 6:51 AM | Updated on Jun 3 2025 6:51 AM

ట్రాఫ

ట్రాఫిక్‌ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ

విజయవాడస్పోర్ట్స్‌: ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ట్రాఫిక్‌ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు ట్రాఫిక్‌ ఏడీసీపీ ప్రసన్నకుమార్‌ సోమవారం స్పోర్ట్స్‌ షూ, మాస్క్‌లు, హ్యాండ్‌ గ్లౌజులను అందజేశారు. సీ్త్ర శక్తిని ప్రోత్సహించే సదుద్దేశంతో పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఏడీసీపీ తెలిపారు. 33 మంది మహిళా కానిస్టేబుళ్లకు ఈ వస్తువులను అందజేశామని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి నలు గురి ప్రాణాలు కాపాడిన నలుగురు కానిస్టేబుళ్లకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏసీపీ పి.రామ చంద్రరావు, సీఐ బాలమురళీకృష్ణ, ఎస్‌ఐ నాగ దుర్గ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా జేసీగా

ఇలక్కియ బాధ్యతల స్వీకారం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ఎస్‌.ఇలక్కియ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జేసీ ఇలక్కియ మాట్లాడుతూ.. జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులతో కలిసి కృషి చేస్తానన్నారు. తాను గతంలో రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌గా, కాకినాడ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసినట్లు తెలిపారు. నూతన జాయింట్‌ కలెక్టర్‌కు విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, డీఎస్‌ఓ ఎ.పాపారావు, గ్రామ/వార్డు సచివా లయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కలెక్టరేట్‌ ఏఓ ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

బీచ్‌ ఫెస్టివల్‌ను

విజయవంతం చేయాలి

చిలకలపూడి(మచిలీపట్నం): తమకు కేటాయించిన విధులను అధికారులు బాధ్యతతో నిర్వహించి మసూల బీచ్‌ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్‌ డి.కె.బాలాజీ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో జేసీ గీతాంజలిశర్మతో కలిసి అధికారులతో మంగినపూడి బీచ్‌ ఫెస్టివల్‌పై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల ఐదో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు బీచ్‌ ఫెస్టివల్‌ జరుగుతుందన్నారు. మెప్మా పీడీ పి.సాయిబాబు నోడల్‌ అధికారిగా, వేదిక వద్ద డ్వామా పీడీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో జిల్లా పంచాయతీ అధికారి, బందరు మునిసిపల్‌ కమిషనర్‌ సమన్వయం చేసుకో వాలని సూచించారు. ఆహారపు స్టాళ్లు ఏర్పాటు చేసేవారు అగ్నిప్రమాద నివారణ జాగ్రత్తలు పాటించాలని స్పష్టంచేశారు. బీచ్‌ ఫెస్టివల్‌ వద్ద అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు సీసీ కెమెరాలు, పార్కింగ్‌, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. బీచ్‌ వద్ద వీఐపీలకు గ్రీన్‌రూంలను ఏర్పాటు చేయాలని సూచించారు. కంట్రోల్‌ రూంను బందరు ఆర్డీఓ పర్యవేక్షించాలని ఆదేశించారు. మచిలీపట్నం నగరం నుంచి మంగినపూడి బీచ్‌ వరకు ఉచిత బస్సులను నడిపాలని, అవి బయలుదేరే వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ శ్రీదేవి, ఆర్డీఓ కె.స్వాతి, మెప్మా పీడీ పి.సాయిబాబు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ1
1/2

ట్రాఫిక్‌ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ

ట్రాఫిక్‌ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ2
2/2

ట్రాఫిక్‌ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement