
మౌలిక వసతులు కల్పించాలి
ఆసిఫాబాద్: జిల్లాలోని తిర్యాణి ఆస్పిరేషనల్ బ్లాక్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందదిరంలో శనివారం తిర్యాణి ఆస్పిరేషన్ బ్లాక్లో 38 అంశాలపై జిల్లా శిశు సంక్షేమ, వైద్య, విద్య, పశుసంవర్ధక, వ్యవసాయ, టి ఫైబర్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణుల వివరాలు తప్పనిసరిగా పోర్టల్లో నమోదు చేయాలన్నారు. క్షయ, మధుమేహ వ్యాధిగ్రస్తుల వివరాలు అందించాలన్నారు. ప్రధా న మంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, డీఎంహెచ్వో సీతారాం, జిల్లా పశువైద్యాధికారి సురేశ్, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.