‘ఆపరేషన్‌ కగార్‌’ నిలిపివేయండి | - | Sakshi
Sakshi News home page

‘ఆపరేషన్‌ కగార్‌’ నిలిపివేయండి

May 3 2025 12:08 AM | Updated on May 3 2025 12:08 AM

‘ఆపరేషన్‌ కగార్‌’ నిలిపివేయండి

‘ఆపరేషన్‌ కగార్‌’ నిలిపివేయండి

ఖమ్మంమయూరిసెంటర్‌: ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక హక్కుల సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం ఖమ్మంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో కాకి భాస్కర్‌, రవిమారుత్‌ ఆధ్వర్యాన మానవహారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు భాగం హేమంతరావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు కాంగ్రెస్‌, మాస్‌లైన్‌, న్యూడెమోక్రసీ, టీజేఎస్‌ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, గోకనపల్లి వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్‌, గోపగాని శంకర్‌రావు మాట్లాడారు. అటవీ ప్రాంతం నుంచి ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బలగాలతో ఆదివాసీలపై దాడులు చేయిస్తోందన్నారు. ఇకనైనా దాడులు నిలిపేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు. ఈకార్యక్రమంలో పార్టీలు, సంఘాల నాయకులు దేవిరెడ్డి విజయ్‌, చిర్ర రవి, కిషన్‌ నాయక్‌, స్వర్ణ సుబ్బారావు, డాక్టర్‌ ఎం.ఎఫ్‌ గోపీనాథ్‌, డాక్టర్‌ యలమంచిలి రవీంద్రనాథ్‌, యలముడి కృష్ణయ్య, అశోక్‌, దాసరి శ్రీను, ఝాన్సీ, పోటు కళావతి, లింగాల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు

వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యాన నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement