
‘లక్కీ’ లాటరీ మోసాలపై స్పందించండి
● నివేదిక ఇవ్వాలని సీపీకి హెచ్ఆర్సీ ఆదేశాలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
లక్కీలాటరీ మోసాలపై ఎట్టకేలకు మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) స్పందించింది. కరీంనగర్ వేదికగా పలుకంపెనీలు కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాలలోని మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని లక్కీ లాటరీలు నడిపి ప్రజలను మోసం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని 2022 అక్టోబరులో ‘లక్కీ లాటరీ మోసాలు’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఉచిత బహుమతులు, నగదు బహుమతులు ఇస్తామంటూ పేదలకు ఆశచూపించి వారి నుంచి రూ.కోట్లు కాజేసి పరారయ్యారు. ఈ విషయంలో పోలీసులు సరిగా వ్యవహరించలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కరీంనగర్కు చెందిన ఇమ్రాన్ అనే యువకుడు మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించాడు. దీంతో జరిగిన ఘటనపై ఈనెల 24వ తేదీలోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కరీంనగర్ సీపీకి హెచ్ఆర్సీ ఆదేశించింది.
రాజన్న గోశాలలో మరో రెండు కోడెలు మృతి
వేములవాడఅర్బన్: శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్లోని గోశాలలో గురువారం అనారోగ్యంతో మరో రెండు కోడెలు మృతిచెందినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి ప్రకటనలో తెలిపారు. అకాలవర్షాలు, అనారోగ్య పరిస్థితులతో గోశాలలో ఇప్పటి వరకు 28 కోడెలు మృతి చెందినట్లు వివరించారు. గోశాలలో ఉన్న 1,300 కోడెలలో ప్రస్తుతం 12 కోడెలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. వీటికి వెటర్నరీ డాక్టర్లు వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
దాణాపూర్ ఎక్స్ప్రెస్ నుంచి కిందపడిన యువకుడు
ఓదెల(పెద్దపల్లి): సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలునుంచి కిందపడిన యువకుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాలు.. గురువారం గోదావరిఖనికి చెందిన కంకణాల సంతోష్ రామగుండం వచ్చేందుకు కాజీపేట్లో దాణాపూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి డోర్ వద్ద కూర్చున్నాడు. పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కిందపడగా తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. బ్లూకోల్ట్ పోలీసులు శంకర్, శివశంకర్ వెంటనే స్పందించి పట్టాల మధ్య ఉన్న సంతోష్ను బయటకు తీసుకువచ్చి అంబులెన్స్లో సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు.

‘లక్కీ’ లాటరీ మోసాలపై స్పందించండి