సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి

May 27 2025 12:00 AM | Updated on May 27 2025 12:00 AM

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి

కరీంనగర్‌టౌన్‌: మొదటి కాన్పులకు పీహెచ్‌సీలకు వచ్చే గర్భిణులను సాధారణ డెలివరీలకు ప్రోత్సహించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు. సోమవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో పీహెచ్‌సీల సూపర్‌వైజర్లతో సమీక్షించారు. సిజేరియన్‌తో ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలను తెలియజేయాలన్నారు. 30ఏళ్ల పైబడి ఉన్నవారికి అధిక రక్తపోటు, షుగర్‌ పరీక్షలు చేయాలన్నారు. తీవ్ర పోషకాహార లోపం, బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి పోషకాహార పునరావాస కేంద్రానికి పంపించాలన్నారు. కౌమారదశ పిల్లలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని పీవోడీటీ డాక్టర్‌ ఉమాశ్రీరెడ్డి సూచించారు. మే 28న అంతర్జాతీయ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఐవో సాజిదా, సనా జవేరియా, శైలేంద్ర, విమల, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement