
డీఎంహెచ్వోను బెదిరించిన వారిపై చర్య తీసుకోవాలి
పెద్దపల్లిరూరల్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్న కుమారి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా చంపేస్తామంటూ బెదిరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, జిల్లా వైద్య ఉద్యోగులు, జేసీ నాయకులు కోరారు. ఈమేరకు మంగళవారం కలెక్టర్ శ్రీహర్షను కలిసి వినతిపత్రం అందించారు. విధుల్లో భాగంగా గోదావరిఖనిలోని శ్రీమమత హాస్పిటల్లో తనిఖీలు చేస్తే అనుమతి తీసుకోకుండానే స్కానింగ్ చేస్తున్నట్లు గుర్తించిన డీఎంహెచ్వో.. మిషన్ సీజ్ చేసి చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారని తెలిపారు. అయితే, తమ బండారం బయటపడుతుందనే భయంతో ఆస్పత్రి రిసెప్షనిస్ట్ ఆనంద్తో డీఎంహెచ్వోపై తప్పుడు కేసు నమోదు చేయించారని పేర్కొన్నారు. తన విధులకు ఆటంకం కలిగించి, చంపుతామని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్ నాగిరెడ్డి, రాజశేఖర్రెడ్డి, స్వాతిని సస్పెండ్ చేయాలని, మరో వైద్యుడు అనిల్కుమార్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని బోర్డుకు సిఫారసు చేయాలని, మహంకాళి స్వామి, ఆనంద్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో డాక్టర్ వాణిశ్రీ, శ్రీరాములు, కిరణ్కుమార్, శ్రీనివాస్, ఉమామహేశ్వర్, దేవీసింగ్, రమేశ్, రాజేశ్, సాలమ్మ, దయామణి తదితరులు ఉన్నారు.
కలెక్టర్కు టీఎన్జీవో వినతి