
నాగంపేటలో దొంగల హల్చల్
గంభీరావుపేట(సిరిసిల్ల): నాగంపేటలో దొంగలు హల్చల్ చేశారు. ఒకేరోజు పదిళ్లలో దొంగతనానికి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. నాగంపేటలో శనివారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. గురుక లక్ష్మి, పొల్తూరి అంజయ్యకు చెందిన ఇళ్లలోని బీరువాలను పగలగొట్టి 6 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. రూ.30వేల నగదు పలువురి ఇళ్ల నుంచి ఎత్తుకెళ్లారు. ల్యాప్టాప్, ఇతర వస్తువులను చోరీ చేశారు. సమాచారమందుకున్న ఎస్సై ప్రేమానందం విచారణ చేపట్టారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దేవాలయాల్లో దొంగతనం
కథలాపూర్: తాండ్య్రాల గ్రామంలోని రేణుక ఎల్లమ్మ, దుర్గామాతా దేవాలయాల్లో ఆదివారం వేకువజామున దొంగతనం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. రేణుక ఎల్లమ్మ దేవాలయంలో తలుపులు ధ్వంసం చేసి వస్తువులను చిందరవందర చేశారు. దుర్గామాతా దేవాలయంలో హుండీని ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఆలయాల సమీపంలో ఉన్న టేలాలను ధ్వంసం చేసి వస్తువులను ఎత్తుకెళ్లారు. రూ.20వేలు నష్టపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. సంఘటనపై వివరాలు సేకరించినట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు.

నాగంపేటలో దొంగల హల్చల్