
‘సర్కారు’ విద్యార్థుల సత్తా
● ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు ● అభినందించిన అధికారులు
సప్తగిరికాలనీ(కరీంనగర్)/మానకొండూర్/తిమ్మాపూర్/రామడుగు: ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఫస్టియర్, సెకండియర్లో అత్యుత్తమ మార్కులు సాధించారు. ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను డీఐఈవో జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అభినందించారు.
● కరీంనగర్లోని బాలికల జూనియర్ కళాశాల ఫస్టియర్లో 63శాతం, సెకండియర్లో 65శాతం ప్రభుత్వ సైన్స్ కళాశాల ఫస్టియర్లో 38.90శా తం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. జమ్మికుంట ప్రభుత్వ కళాశాల 61.50శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. కరీంనగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సెకండియర్ ఎంపీసీ విద్యార్థిని గొల్లపల్లి అభినయ 982 మార్కులు, బైపీసీలో జుబియా జైన్ 973, సీఈసీలో కెకాశన్ ఉన్నిసా 944 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో గంట్ల సిరిచందన 460, బైపీసీలో షిఫాఫాతిమా 429, సీఈసీలో గంగాధర జ్యోతి 471, ఒకేషనల్లో పాటిల్ ఆర్థి 494 మార్కులు సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ నిర్మల, అధ్యాపకులు కనకయ్య, వెంకటరాజురెడ్డి, రాధాకృష్ణ అభినందించారు.
● కరీంనగర్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల్లో దొడ్ల రిషిత బైపీసీలో 980మార్కులు సాధించింది. ఫస్టియర్ ఎంపీసీలో మహ్మద్ రియాన్ దస్తాగిర్ 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచాడని కళాశాల ప్రిన్సిపాల్ సత్యవర్ధన్రావు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను డీఐఈవో అభినందించారు. అధ్యాపకులు మధుజాన్సన్, ప్రమీల, దీప్తి, రమేశ్, జియాఉద్దీన్, రాహుల్, సంపత్ పాల్గొన్నారు.
● మానకొండూర్ మండలం దేవంపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు, పోచంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. దేవంపల్లి గురుకుల పాఠశాలలో ఎంపీసీ ఫస్టియర్ విద్యార్థి జె.మనోజ్కుమార్ 465 మార్కులు సాధించాడు. బైపీసీలో బి.రాకేష్ 402 మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో కె.శివ కుమార్ 982మార్కులు, బైపీసీలో డి.సంపత్ 983 మార్కులతో సత్తా చాటారు. పో చంపల్లి మోడల్ స్కూల్లో పిల్లి అంజలి సీఈ సీలో 492, బైపీసీలో బి.రక్షిత 434మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో బూస స్పందన 941 మార్కులతో సత్తా చాటింది.
● రామడుగు మోడల్ స్కూల్ విద్యార్థిని భోగ శ్రీజ సీఈసీలో 500 మార్కులకు 494 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్ మనోజ్కుమార్ తెలిపారు.
● అలుగునూర్లోని సీవోఈ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. బైపీసీ సెకండియర్లో రాజ్యలక్ష్మి, సంధ్య 991మార్కులు, ఎంపీసీలో శరణ్య 991మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో అక్షిత, నితీష, సౌమ్య, భవిత, నందినిలు 467మార్కులు, బైపీసీలో ప్రసన్న, శ్రీనిజ 436 మార్కులు సాధించారు.