
‘సీపీఐ తిరుగులేని శక్తిగా ఎదగాలి’
కరీంనగర్: నగరంలో సీపీఐ పార్టీ ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పార్టీ జాతీ య కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పిలు పునిచ్చారు. సీపీఐ కరీంనగర్ నగర 11వ మ హాసభ సందర్భంగా శుక్రవారం పార్టీ కార్యాలయం ఎదుట సీపీఐ పతాకాన్ని జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్లో అనేక భూ పోరాటాలు చేసి వేలా ది మందికి ఇళ్లు ఇప్పిచ్చిన చరిత్ర సీపీఐదని అన్నారు. చింతకుంట, రేకుర్తి, బద్దిపల్లి గ్రామాల్లో ఎంతోమంది నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడంలో క్రియాశీలక పాత్ర వహించామన్నారు. నగరంలో ప్రభుత్వ భూములు కొందరు రాజకీయ నేతలు, కార్పొరేటర్ల కనుసన్నల్లో ఉన్నాయని, వాటిని పేదలకు పంచేందుకు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్లో రూ.కోట్ల దోపిడీ జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. అన్ని డివిజన్లలో పార్టీ ప్రజాసంఘాల విస్తరణకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలన్నారు. సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు, కిన్నెర మల్ల మ్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పంజాల శ్రీనివాస్, నలువాల సదానందం, సాయవేణి రాయమల్లు, శారద తదితరులు పాల్గొన్నారు.
దుర్శేడ్లో అన్నమయ్య వారసులు
కరీంనగర్రూరల్: శ్రీతాళ్లపాక అన్నమయ్య 12వ తరం వారసులు తాళ్లపాక స్వామిజీ దంపతులు శుక్రవారం దుర్శేడ్లోని శ్రీ వేణుగోపాలస్వామి, మరకతలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయాలను సందర్శించారు. శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించి భక్తులకు తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి మహత్యం, భగవద్గీతపై ఉపదేశం చేశారు. ఆలయ పూజారి ప్రశాంత్శర్మ, మధుసూదనాచార్యులు, మాజీ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్రావు, నందాల తిరుపతి, అరవింద్, పవన్ పాల్గొన్నారు.
ఇన్చార్జి ఎస్ఈగా శ్రీనివాస్రావు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజినీర్గా ప్రజా రోగ్యశాఖ ఎస్ఈ ఎన్.శ్రీనివాస్రావు నియామకం అయ్యారు. ఇప్పటివరకు ఎస్ఈగా ఉన్న రాజ్కుమార్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లడం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో శ్రీనివాస్రావుకు నగరపాలకసంస్థ ఎస్ఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు.