
జోరుగా బెటి్టంగ్
నిఘా కరువు..
కామారెడ్డి క్రైం : క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం. గతంలో ఆటను ఆటగానే చూసేవారు. తమ అభిమాన ఆటగాళ్ల ఆటను చూసేందుకు టీవీల ముందునుంచి కదిలేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆట జూదంగా మారిపోయింది. చాలామంది బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయారు.
బాల్ బాల్కు పందెం..
బెట్టింగ్ సంస్కృతి గల్లీలకూ పాకింది. నిర్వాహకుల ను సంప్రదించి మ్యాచ్ల వారీగా, ఓవర్ల వారీగా పందాలు కాస్తున్నారు. మ్యాచ్ ఆసక్తికరంగా మారి తే బంతి బంతికీ బెట్టింగ్ నడుస్తోంది. ఈ వ్యసనా నికి బానిసైనవారు బెట్టింగ్లో నష్టపోతూ ఆర్థికంగా దివాలా తీస్తున్నారు. మానసికంగానూ నలిగిపోతున్నారు. అప్పుల పాలై, వాటిని ఎలా తీర్చాలో తె లియక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు సైతం ఉన్నాయి. ఇటీవల దేవునిపల్లికి చెందిన ఓ యువకు డు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అత ని అప్పులకు క్రికెట్ బెట్టింగ్ ప్రధాన కారణమని తె లిసింది. ఆస్తులు అమ్ముకునే పరిస్ధితి వచ్చిన కు టుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. పరువు పోతుందని బయటకు చెప్పుకోలేని వారు కూడా ఉన్నారు.
గల్లీగల్లీకి పాకిన సంస్కృతి
వ్యసనంగా మారిన వైనం
దృష్టి సారించని పోలీసు శాఖ
ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి జిల్లావ్యాప్తంగా జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇది బహిరంగ రహస్యమే.. ఒక్క నిజామాబాద్ పోలీసులు మాత్రమే ఈ ఏడాది బెట్టింగ్ ముఠాను గుర్తించి పట్టుకున్నారు. మిగతా ఎక్కడా ఐపీఎల్ బెట్టింగ్ మూలాలను గుర్తించలేదు. కామారెడ్డి, బాన్సువాడ లలో గతంలో కొన్ని ముఠాలు బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకుని రిమాండ్కు పంపారు. ఈ సీజన్లో కూడా అన్ని ప్రాంతాల్లో జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో బెట్టింగ్ ముఠాలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. మండలాలు, గ్రామాల్లో వ్యక్తుల మధ్య నేరుగా పందాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దందాను అడ్డుకునే విషయమై పోలీసు శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.