కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

May 3 2025 7:44 AM | Updated on May 3 2025 7:44 AM

కల్యా

కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

కల్యాణోత్సవాలకు ముత్యాల

తలంబ్రాలు సమర్పణ

అన్నవరం: ఈ నెల 8వ తేదీ రాత్రి జరగనున్న సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవానికి కాకినాడకు చెందిన జేఎన్‌టీయూ ప్రొఫెసర్లు ఎల్‌.సుమలత, ఎన్‌.ఉదయ శంకర్‌ శుక్రవారం ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సత్యదేవుని ఆలయం వద్ద ఈఓ వీర్ల సుబ్బారావుకు వారు శుక్రవారం ఈ తలంబ్రాలు అందచేశారు.

రథోత్సవం నాడు తగిన

జాగ్రత్తలు తీసుకోవాలి

దేవస్థానం అధికారులకు

జిల్లా కలెక్టర్‌ ఆదేశం

ఉత్సవాల ఏర్పాట్లను వివరించిన ఈఓ

అన్నవరం: ఈ నెల 7 నుంచి జరగనున్న సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అన్నవరం దేవస్థానం అధికారులను జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ ఆదేశించారు. సింహాచలం అప్పన్న చందనోత్సవం నాడు జరిగిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందిన నేపథ్యంలో.. ‘ముందస్తు ప్రణాళిక.. మనకుందా? శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం కథనం ప్రచురించింది. ఆర్‌డీఓ, డీఎస్పీ తదితర అధికారులు హాజరు కాకపోవడంతో గత నెల 23న జరిగిన దేవస్థానం, ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయ సమావేశం తూతూ మంత్రంగా జరిగిందని, ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్‌, దేవదాయ శాఖ కమిషనర్‌ సమీక్షించాలని ఆ కథనంలో ‘సాక్షి’ పేర్కొంది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ షణ్మోహన్‌ శుక్రవారం సత్యదేవుని ఆలయాన్ని సందర్శించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లపై ఈఓ వీర్ల సుబ్బారావును అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా ఈ నెల 11న జరిగే సత్యదేవుని రథోత్సవానికి విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. రథం లాగేందుకు నిపుణులను తీసుకుని రావాలని ఆదేశించారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని, దేవస్థానం సిబ్బందితో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని ఈఓకు స్పష్టం చేశారు. ఆలయం వద్ద కలెక్టర్‌ షణ్మోహన్‌కు పండితులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం పండితులు వేదాశీస్సులు, ఈఓ సుబ్బారావు ప్రసాదాలు అందజేశారు.

అధికారులతో ఈఓ సమీక్ష

కలెక్టర్‌ ఆదేశాల నేపథ్యంలో కల్యాణోత్సవ ఏర్పాట్లపై ఈఓ సుబ్బారావు దేవస్థానం అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకూ జరిగిన ఏర్పాట్లు, ఇంకా చేపట్టాల్సినవేమిటో ఆరా తీశారు. ఎటువంటి అసంతృప్తికీ తావు లేకుండా ఉత్సవాల ఏర్పాట్లలో పాల్గొనాలని కోరారు. ఉత్సవాలు పూర్తయ్యేంత వరకూ ఉద్యోగులు సెలవులు అడగవద్దని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు1
1/4

కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు2
2/4

కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు3
3/4

కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు4
4/4

కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement