
జాతీయ బోట్గేమ్ పోటీల్లో వర్షిత ప్రతిభ
పెదపూడి: భోపాల్లోని లోయర్లేక్ వేదికగా ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించిన 35వ జాతీయ కెనోయ్ స్ప్రింట్ (బోట్గేమ్) చాంపియన్షిప్ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన గొలుగూరి వర్షిత కాంస్య పతకం సాధించిందని ఆమె తల్లిదండ్రులు రాజేష్రెడ్డి, విజయలక్ష్మి సోమవారం తెలిపారు. అనపర్తిలో వారు మాట్లాడుతూ సబ్ జూనియర్ కె4 500 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించినట్టు తెలిపారు. వర్షిత ప్రస్తుతం విజయవాడలోని ఎన్ఎస్ఎం పాఠశాలలో 8వ తరగతి చదువుతోందన్నారు.