
అవతరణ దినోత్సవానికి ముస్తాబు
గద్వాల: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కలెక్టరేట్ ముస్తాబైంది. అలాగే జిల్లాకేంద్రంలోని ముఖ్య కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించారు. దీంతోపాటు జిల్లా కేంద్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలను లైట్లతో అలంకరించారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ భవనంపై ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ జితేందర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమానికి కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు హాజరుకానున్నారు.
విద్యుద్దీపాల వెలుతురులో కలెక్టరేట్