ధీరవనిత అహల్యబాయి | - | Sakshi
Sakshi News home page

ధీరవనిత అహల్యబాయి

Jun 1 2025 1:02 AM | Updated on Jun 1 2025 1:02 AM

ధీరవనిత అహల్యబాయి

ధీరవనిత అహల్యబాయి

పాలమూరు: ఒక హిందూ మహిళగా హైందవ సంస్కృతిని కాపాడుతూ, రాజ్య సంరక్షణలో అహల్యబాయి హాల్కెర్‌ చేసిన కృషిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మరాఠా మహారాణి అహల్యబాయి 300వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో చరిత్రలోని ధీర వనితలలో అహల్యబాయి ఒకరు అని కొనియాడారు. ఆమె ఎన్నో పురాతన ఆలయాలు నిర్మించిందని, వందకు పైగా కొత్తగా శివాలయాలను అభివృద్ధి చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, బాలాత్రిపురసుందరి, సాహితీరెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement