వైభవంగా రాములోరి పట్టాభిషేకం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా రాములోరి పట్టాభిషేకం

Apr 8 2025 7:39 AM | Updated on Apr 8 2025 7:39 AM

వైభవంగా రాములోరి పట్టాభిషేకం

వైభవంగా రాములోరి పట్టాభిషేకం

ఎర్రవల్లి/ఉండవెల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు ఉదయం ఆలయంలో అర్చకులు సుప్రభాతసేవ, నైవేద్యం, తీర్థప్రసాదగోష్టి, తదనంతరం విష్వక్షేనపూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, కలశపూజ, అభిషేకం, వస్త్రసమర్పన, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు వేద మంత్రాల నడుమ నిర్వహించారు. అనంతరం సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమాన్ని మంగళవాయిద్యాల నడుమ కనులపండువగా చేపట్టారు.

నేత్రపర్వం.. రథోత్సవం

ఉండవెల్లి మండల కేంద్రంలోని మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో రాములోరి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఓ వైపు బాలికలు, చిన్నారుల కోలాటాలు.. మహిళల మంగళహారతుల నడుమ కనులపండువగా సాగింది.

బీచుపల్లిలో రాములోరికి

పట్టాభిషేకం చేస్తున్న అర్చకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement