చెక్‌పోస్టుల వద్ద నిఘా పటిష్టం | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్టుల వద్ద నిఘా పటిష్టం

Published Sun, Nov 12 2023 1:26 AM

నందిన్నె చెక్‌పోస్టు వద్ద ఆరా తీస్తున్న 
ఎన్నికల పోలీస్‌ పరిశీలకుడు అనుపమ్‌శర్మ  - Sakshi

కేటీదొడ్డి: కర్ణాటక సరిహద్దుతో పాటు ఇతర ప్రాంతాల చెక్‌పోస్టుల వద్ద నిఘా పటిష్టం చేయాలని, ఖచ్చితంగా తనిఖీల సమయంలో వీడియో రికార్డు చేయాలని గద్వాల జిల్లా ఎన్నికల పోలీస్‌ పరిశీలకుడు హిమాచల్‌ప్రదేష్‌ డీఐజీ అనుపమ్‌ శర్మ ఆదేశించారు. శనివారం మండలంలోని నందిన్నె చెక్‌పొస్టును ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. సరిహద్దు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, నగదు, మద్యం, పై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కర్ణాటక నుంచి వచ్చే వాహనాల తనిఖీపై ఆరా తీశారు. పట్టుబడిన నగదును ఎప్పటికప్పుడు గ్రీవెన్స్‌ కమిటీకి అప్పగించాలని అలాగే ఎకై ్సజ్‌ పోలీసుల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఎఎస్‌టీం హెడ్‌ కానిస్టేబుల్‌ పరమేష్‌, ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌ రాములు, ప్రేమ్‌కుమార్‌, రంజిత్‌, ఐటీబీపీ టీం సభ్యులు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement