
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
రెవెన్యూ సదస్సులు
పకడ్బందీగా నిర్వహించాలి
సబ్ కలెక్టర్ మయాంక్సింగ్
కాటారం: భూ భారతిలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను గ్రామాల్లో పకడ్బందీగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ రెవెన్యూ అధికా రులకు సూచించారు. కాటారం మండలం ధ న్వాడలో గురువారం కొనసాగిన రెవెన్యూ సదస్సును సబ్కలెక్టర్ పరిశీలించారు. దరఖాస్తుల సేకరణ ప్రక్రియ, దరఖాస్తుల వివరాలను త హసీల్దార్ నాగరాజును అడిగి తెలుసుకున్నా రు. దరఖాస్తుల నమోదు రిజిస్టర్ను తనిఖీ చేశారు. ప్రతీ దరఖాస్తును రిజిస్టర్లో నమోదు చేసి తర్వాత ఆన్లైన్లో ఎంటర్ చేయాలన్నా రు. కాగా మూడవ రోజులో భాగంగా చిద్నెపల్లిలో 178, ధన్వాడలో 329 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ఈ సదస్సుల్లో నయాబ్ తహసీల్దార్ రామ్మోహన్, ఆర్ఐ వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.
పుణ్యక్షేత్రాలకు
ఆర్టీసీ బస్సులు
భూపాలపల్లి అర్బన్: పుణ్య క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో టూర్ ప్యాకేజీలను కల్పిస్తున్నట్లు భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూపాలపల్లి డిపో నుంచి కొమురవెళ్లి, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, భద్రాచలం, పర్ణశాల, మల్లూరు, నాగార్జునసాగర్, విజయవాడ, అన్నవరం ఐదు రూట్లలో పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 9959226707, 9701967519 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.