
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు
గణపురం: అర్హులైన నిరుపేదలకు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మండలంలోని గొల్లపల్లి, బస్వరాజు పల్లి, జంగుపల్లి, వెంకటేశ్వరపల్లి, ధర్మరావుపేట, నగరంపల్లి, కోండాపూర్, సీతారాంపూర్, అప్పయ్యపల్లి, కర్కపల్లి, మైలారం గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను హౌసింగ్ పీడీ లోకిలాల్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాలపై పెట్టిన శ్రద్ధ పేదల ఇళ్లపై పెట్టలేదన్నారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు. అలాగే మండలంలోని చెల్పూర్ గ్రామంలో జరిగి రెవెన్యూ సదస్సులో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు