సోమేశ్వర ఆలయంలో ఆరుద్రోత్సవం | - | Sakshi
Sakshi News home page

సోమేశ్వర ఆలయంలో ఆరుద్రోత్సవం

May 30 2025 1:10 AM | Updated on May 30 2025 12:48 PM

పాలకుర్తి టౌన్‌: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో గురువారం రాత్రి ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య వైభవంగా నిర్వహించారు. పంచ హారతులతో చేపట్టిన గర్భాలయ దీపోత్సవాన్ని భక్తులు కనులారా తిలకించి తరించా రు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్‌.శర్మ, దేవగిరి అనిల్‌కుమార్‌, నాగరా జు, సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

రఘునాథపల్లి: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా రైతులకు సూచించారు. గురువారం రఘునాథపల్లి, కంచనపల్లి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన.. రైతులు తీసుకువచ్చిన ధాన్యంలో తేమను పరిశీలించారు. లారీల కొరత, మిల్లర్ల సమస్యలపై ఆరా తీశారు. టార్పాలిన్‌ షీట్లు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కాంటాలు అయిన వెంటనే మిల్లులకు తరలించాలని చెప్పారు. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తహసీల్దార్‌ ఎండీ.మోహ్సిన్‌ముజ్తబ, ఏపీఎం సారయ్య పాల్గొన్నారు.

యాక్షన్‌ ప్లాన్‌ను విజయవంతం చేయాలి

జనగామ: రాష్ట్ర ప్రభుత్వం పురపాలికల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ను విజయవంతం చేయాలని కమిషనర్‌ వెంకటేశ్వర్లు సూచించారు. మున్సిపాలిటీలో గురువారం మేనేజర్‌, ఆర్‌ఓ, ఆర్‌ఐ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, వార్డు ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ యాక్షన్‌ ప్లాన్‌లో ఇంటింటికీ తడి పొడిచెత్త సేకరణపై ప్రజలకు అవకాహన కల్పించాలని, ఇంటి పరిసరాల్లో చెత్తను తొలగించడం, రోడ్డు పక్కన ఉన్న పొదలను క్లీన్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజారోగ్య శాఖ నుంచి వైద్యుల ఆధ్వర్యాన డెంగీ, మలేరియా బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

సోమేశ్వర ఆలయంలో ఆరుద్రోత్సవం1
1/1

సోమేశ్వర ఆలయంలో ఆరుద్రోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement