ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇవ్వాలి

Published Mon, Mar 25 2024 1:30 AM

మాట్లాడుతున్న మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ - Sakshi

కథలాపూర్‌(వేములవాడ): కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ యాసంగి సీజన్‌ నుంచే వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని తాండ్య్రాలలో విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరుతో అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు హామీలు అమలు చేసేందుకు సాకులు చెబుతోందని మండిపడ్డారు. చెరువులు, కుంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చినా పట్టించుకోకుండా చోద్యం చూస్తోందన్నారు. రూ.2లక్షల రుణమాఫీ, రైతుబంధు వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్‌ ఐదు రూపాయల పనిచేయలేదన్నారు. తనను గెలిపిస్తే ప్రజా సమస్యలపై గళం వినిపిస్తామన్నారు. సమావేశంలో మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి, ఎంపీపీ జవ్వాజి రేవతి, జెడ్పీటీసీ భూమయ్య, వైస్‌ ఎంపీపీ కిరణ్‌రావు, తిరుజాని, కల్లెడ శంకర్‌, చెక్కపల్లి రాజుకుమార్‌, పాలెపు రాజేశ్‌, నల్ల గంగాధర్‌, జలంధర్‌, మంచాల మహేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement