
వెన్నుపోటు దినం విజయవంతం చేద్దాం
మంగళగిరి: ఈ నెల 4వ తేదీన వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వెన్నుపోటు దినంలో నియోజకవర్గంలోని ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులు పిలుపునిచ్చారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆత్మకూరు జాతీయ రహదారి వెంట కల పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం వెన్నుపోటు దినం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. వేమారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అనేక మోసపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు. నియోజకవర్గంలో నివాసముంటన్న చంద్రబాబు, లోకేష్ల కళ్లు తెరిపించేలా వెన్నుపోటు దినాన్ని ప్రజలు విజయవంతం చేయాలన్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని, చంద్రబాబుకు ఆ ఘనత దక్కిందన్నారు.
చంద్రబాబు, లోకేష్ల కళ్లు తెరిపించాలి..
ఎమ్మెల్సీ హనుమంతరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వెన్ను పోటు దినంలో ప్రజలంతా ఐక్యంగా పాల్గొనాలన్నారు. ప్రజలకు చేసిన మోసాన్ని చంద్రబాబుకు తెలిసేలా వెన్ను పోటు దినంను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలను సూపర్ సిక్స్ పేరుతో మోసం చేసిన చంద్రబాబును ప్రజలు నిలదీయాలన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో ఇచ్చిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపేసిన చంద్రబాబు తన పాలనలో ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, ప్రజలంతా వెన్నుపోటు దినంలో పాల్గొని చంద్రబాబు, లోకేష్లు కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మంగళగిరి, తాడేపల్లి పట్టణ, మండల, దుగ్గిరాల అధ్యక్షులు నాలి వెంకట కృష్ణ, బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, అమరా నాగయ్య, తాడిబోయిన శివగోపయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్ రాజు, సీనియర్ నాయకుడు పాటిబండ్ల కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమారి, అనుబంధ సంఘాల అధ్యక్షులు కట్టెపోగు భూషణం, బందాపు రుక్మాంగరెడ్డి, యర్రకోటి మల్లిఖార్జునరెడ్డి, రత్నాకరం శ్రీనివాసరాజు,సయ్యద్ గౌస్ మొహిద్దీన్, ఈపూరి ఆదామ్, తిరుమల శెట్టి సురేంద్ర,కలకోటి సునీల్కుమార్, షేక్ జానీ బాషా, చిలువూరి ఫిలోమినా, జంగా నాగిరెడ్డి, భీమిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి, మాదాల గోపీ కృష్ణ, నందిగం ఆకాష్, లేళ్ళ సురేష్, షేక్ సర్ధార్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు, లోకేష్ల కళ్లు తెరిపించేలా నియోజకవర్గంలో కార్యక్రమం
నిర్వహిస్తాం
వాల్ పోస్టర్ల ఆవిష్కరణలో వైఎస్సార్ సీపీ మంగళగిరి సమన్వయకర్త వేమారెడ్డి,
ఎమ్మెల్సీ హనుమంతరావు