
నిర్బంధ బదిలీల ఆదేశాలు ఉపసంహరించుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా స్కూల్ అసిస్టెంట్ కేడర్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా నిర్భంద బదిలీ చేయాలని ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు డిమాండ్ చేశారు. ఆదివారం పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డిని ఆర్జేడీ కార్యాలయంలో కలిసి ఉపాధ్యాయుల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. లాంగ్ స్టాండింగ్లో లేకున్నప్పటికీ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా వెళ్లాల్సిందేనని ఒత్తిడి తీసుకువచ్చి, నిర్బంధ బదిలీపై పంపాలనే నిర్ణయాన్ని ఎస్టీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్వీసులో సీనియార్టీని పరిగణలోకి తీసుకుని, మెరిట్ జాబితా సిద్ధం చేయాల్సి ఉండగా, పుట్టిన తేదీ ఆధారంగా జాబితాలను తయారు చేయడం నిబంధలకు విరుద్ధమన్నారు. తక్షణమే వాటిని సరిచేసి మెరిట్ ప్రకారం జాబితాలు తయారు చేయాలని కోరారు. రీ అప్పోర్షన్కు గురైన ఉపాధ్యాయులకు ఓల్డ్ స్టేషన్ పాయింట్స్తో పాటు జత చేసిన రీ అప్పోర్షన్ పాయింట్లను తొలగించాలన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఆర్జేడీని కలిసిన వారిలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుబ్బారెడ్డి, నాయకులు శ్యామ్, దిబ్బయ్య, బాజీ, వెంకట్రావు ఉన్నారు.
ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి
సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు