శ్రామికుల పక్షం వైఎస్సార్‌ సీపీ | - | Sakshi
Sakshi News home page

శ్రామికుల పక్షం వైఎస్సార్‌ సీపీ

May 2 2025 1:47 AM | Updated on May 2 2025 1:47 AM

శ్రామ

శ్రామికుల పక్షం వైఎస్సార్‌ సీపీ

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): కార్మికుల కన్నీటి కష్టంలో నుంచి.. వారి హక్కుల సాధన కోసమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిందని పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బృందావన్‌ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు శేషగిరి పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కార్మికులకు సంబంధించిన న్యాయబద్ధమైన సమస్యల పరిష్కరించకపోవటం దారుణమని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ పేరులో ‘ఎస్‌’ అనే ఆంగ్ల అక్షరం శ్రామిక అని.. అలా పేరు పెట్టి శ్రామికులకు గుర్తింపునిచ్చిన ఘనత వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం మేడేను కేవలం అలంకారప్రాయంగా కాకుండా కార్మిక, కర్షక సమస్యలు పరిష్కరించేందుకు దృష్టి సారించాలని హితవు పలికారు. పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు శేషగిరి పవన్‌కుమార్‌ మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి అమ్మ ఒడి, వైఎస్సార్‌ వాహన మిత్రతో పాటు అనేక పథకాల ద్వారా ప్రతి ఏటా రూ.75వేలు లబ్ధి చేకూరిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.15వేలు ఇస్తామని నమ్మబలికి వంచించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో కార్మికులపై కేసులు నమోదు అధికంగా అవుతున్నాయన్నారు.

మే డే వేడుకల్లో కార్మికులకు పెద్దపీట

పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి జిల్లా కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు కార్మికులతో జెండా ఎగురవేయించిన మోదుగుల

శ్రామికుల పక్షం వైఎస్సార్‌ సీపీ 1
1/1

శ్రామికుల పక్షం వైఎస్సార్‌ సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement