టూడీ.. మళ్లీ రండీ! | - | Sakshi
Sakshi News home page

టూడీ.. మళ్లీ రండీ!

Apr 29 2025 7:09 AM | Updated on Apr 29 2025 7:09 AM

టూడీ.

టూడీ.. మళ్లీ రండీ!

గుంటూరు
మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

గుంటూరు మెడికల్‌: పేదల పెద్ద ఆసుపత్రిగా పేరొందిన గుంటూరు జీజీహెచ్‌లో గుండె జబ్బు నిర్ధారణ పరీక్షల కోసం పేద రోగులు నానా అగచాట్లు పడాల్సి వస్తుంది. అసలే ఓ పక్క గుండె జబ్బు ఉందనే భయం వెంటాడుతుంటే, మరోపక్క వైద్య పరీక్ష నిర్ధారణకు రోజుల తరబడి వేచి చూడాలని వైద్యులు తెలియజేస్తుండటంతో మరింత తీవ్ర ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సుమారు ఏడు జిల్లాలకు చెందిన పేద రోగులు గుండె జబ్బుల చికిత్స కోసం జీజీహెచ్‌కు ఎంతో ఆశతో వస్తుంటే, వారిని తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యేలా వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరు ఉంది.

రోగుల సహనానికి ‘పరీక్ష’

జీజీహెచ్‌లో గుండెజబ్బు నిర్ధారణకు తొలుత ఈసీజీ పరీక్ష చేసి అనంతరం టూడీ ఎకో పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష నివేదిక ఆధారంగానే గుండెజబ్బును నిర్ధారించి మందులు ఇవ్వడమా, లేక యాంజియోగ్రామ్‌ చేసి మరింత చికిత్స అందించడమా అనేది నిర్ధారిస్తారు. టూడీ ఎకో పరీక్ష కోసం వచ్చే రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఇన్‌ పేషెంట్‌ విభాగంలో టూడీ ఎకో పరీక్షల కోసం ఏర్పాటు చేసిన గది వద్ద సరిపడా గాలి, వెలుతురు లేకపోవడంతో వేసవి ఉక్కపోతలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సరైన వసతులు లేక, కనీసం నిలబడేందుకు కూడా స్థలం లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

జూనియర్‌ వైద్యులతోనే సరి!

కార్డియాలజీ విభాగంలో విభాగాధిపతి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మొత్తం ఐదుగురు సీనియర్‌ వైద్యులు ఉన్నప్పటికీ గుండె జబ్బును నిర్ధారించే అత్యంత కీలకమైన టూడీ ఎకో పరీక్షను కేవలం పీజీ వైద్యులతోనే చేయిస్తూ సీనియర్‌ వైద్యులు సొంత ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓపీ విభాగంలో దాతల సహాయంతో టూడీ ఎకో మిషన్‌ ఏర్పాటు చేయించినప్పటికీ దానిని అలంకార ప్రాయంగా ఉంచి, రోగులందరిని ఇన్‌పేషెంట్‌ విభాగంలోకి తరలిస్తున్నారు. దీంతో అక్కడ తీవ్రమైన రద్దీ ఏర్పడుతోంది.

ఏసీలు పనిచేయక అవస్థలు

ఒక పక్క గుండె జబ్బు నిర్ధారణకే గంటలు, రోజులు వేచి చూస్తున్న రోగులు అష్టకష్టాలు పడి వార్డులో చికిత్స కోసం చేరితే అక్కడ ఏసీలు పనిచేయక ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఎక్కువ రోజులు చికిత్స పొందుతున్న రోగులు తామే సొంతంగా ఫ్యాన్లు కొనుగోలు చేసుకుని మంచాల వద్ద పెట్టుకుంటున్న దుస్థితి పెద్ద ఆసుపత్రిలో నెలకొంది. సీసీయూ విభాగంలో ఏసీలు పనిచేయక వైద్యులు, వైద్య సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి అధికారులు ఇకనైనా కళ్లు తెరిచి గుండె జబ్బు రోగుల కష్టాలు తొలగించేలా పనిచేయాలని పలువురు రోగులు కోరుతున్నారు.

శనివారం ఇన్‌పేషెంట్‌ విభాగం వద్ద వైద్య పరీక్షల కోసం వేచి చూస్తున్న రోగులు

మధ్యాహ్నం వరకే ..

7

న్యూస్‌రీల్‌

అలంకారప్రాయంగా

ఓపీ విభాగంలోని ఎకో మిషన్‌

ఇన్‌పేషెంట్‌ విభాగం వద్ద తీవ్ర రద్దీ

పరీక్షలు లేక చికిత్సకు జాప్యం

జీజీహెచ్‌లో గుండెజబ్బుల రోగుల

అవస్థలు

పనిచేయని ఏసీలతో ఇక్కట్లు

ప్రతిరోజూ వంద మందికి మించి వైద్య పరీక్షలు చేయడం లేదు. అధిక సంఖ్యలో రోగులు వస్తే వారిని మరోరోజు రావాలంటూ డేట్లు ఫిక్స్‌ చేసి ఇళ్లకు పంపిస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిబంధనల ప్రకారం వైద్యులు పనిచేయాల్సి ఉంటుంది. కానీ కేవలం మధ్యాహ్నం భోజనం సమయం వరకే 2 గంటల్లోపే టూడీ ఎకో పరీక్షలను ఆపేస్తున్నారు. తద్వారా పేద రోగులు కేవలం పరీక్ష కోసమే రోజుల తరబడి, కొన్నిసార్లు ఉదయం వచ్చి మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సి వస్తుంది. ఏళ్ల తరబడి ఈ సమస్య పేద రోగులను వేధిస్తున్నా, ఆసుపత్రి అధికారులు సమస్య పరిష్కారమయ్యేందుకు ప్రణాళికా బద్ధంగా పనిచేయడం లేదని విమర్శలు ఉన్నాయి. గుండె జబ్బుకు నిర్ధారణ చాలా కీలకం కాబట్టి, రోగులకు ఏరోజు కారోజే టూడీ ఏకో పరీక్ష చేసేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశశ్వి రమణను వివరణ కోరగా కార్డియాలజీ విభాగంలో గుండె జబ్బు రోగులకు త్వరితగతిన వైద్య పరీక్షలు జరిగేలా చూస్తామని తెలిపారు.

టూడీ.. మళ్లీ రండీ! 1
1/2

టూడీ.. మళ్లీ రండీ!

టూడీ.. మళ్లీ రండీ! 2
2/2

టూడీ.. మళ్లీ రండీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement