
నేడు ఏదీ ఇవ్వకుండా..
నాడు తు.చ. తప్పకుండా..
సాక్షి, అమలాపురం: తాము అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటిస్తూంటాయి. తద్వారా ప్రజల మనసులను చూరగొని అధికారంలోకి వస్తూంటాయి. గద్దెనెక్కిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేస్తూంటాయి. మరికొన్నింటిని వదిలేస్తాయి. అయితే, మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీనీ నెరవేర్చటమే కాకుండా అందులో చెప్పని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నెరవేర్చిన అరుదైన ఘనత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇదే సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన ఒక్క హామీ కూడా అమలు చేయని అప్రతిష్టను కూటమి ప్రభుత్వం మూటగట్టుకుంటోంది.
అమలుకు నోచని టీడీపీ సూపర్ సిక్స్ మేనిఫెస్టో
నాడు సంక్షేమ క్యాలెండర్
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టో ప్రకారం ప్రతి సంక్షేమ పథకానీ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తు.చ. తప్పకుండా అమలు చేశారు. సంక్షేమ పథకాల అమలుకు ఏకంగా క్యాలెండర్ విడుదల చేయడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచారు. అంతే కాదు.. మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలను కూడా అమలు చేశారు. విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేశారు.
నాడు–నేడు, విదేశీ విద్య, ఆరోగ్యశ్రీలో చికిత్సల సంఖ్య, వ్యయ పరిమితి పెంపు, జగనన్న సురక్ష ద్వారా ఇంటి వద్దనే మెరుగైన వైద్యం వంటి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఆ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో కేవలం సంక్షేమ, సహాయ కార్యక్రమాల ద్వారానే జిల్లా ప్రజలకు సుమారు రూ.3,500 కోట్ల మేర లబ్ధి చేకూరిందని అంచనా. రెండేళ్ల పాటు కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందులు పడినా కూడా లెక్క చేయకుండా సంక్షేమ పథకాలు అందించారు.
అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని
అందించిన నవరత్నాలు
ఫ మేనిఫెస్టోను పక్కాగా అమలు చేసిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
ఫ నవరత్నాల పేరిట ప్రతి వర్గానికీ
సంక్షేమం
ఫ మేనిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు
ఫ నేడు అమలుకు నోచని టీడీపీ మేనిఫెస్టో
ఫ అన్ని వర్గాలకూ దగా

నేడు ఏదీ ఇవ్వకుండా..